Suryapet Crime: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ లో ఆదివారం తెల్లవారుజామున ఒక దారుణమైన హత్య వెలుగుచూసింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, మద్యం మత్తులో ఆమెను కిరాతకంగా చంపేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మద్యం మత్తులో ఉన్న శ్రీను, గొడవకు దిగాడు. కర్రతో భార్య తలపై కొట్టి అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం ఆదివారం ఉదయం నిందితుడు పోలీసుల వద్ద లొంగిపోయాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Women’s Day 2026: మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: