Spiritual Facts: భారతీయ సంప్రదాయంలో పుట్టుక నుండి మరణం వరకు ప్రతి ఘట్టానికి విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా మరణానంతరం నిర్వహించే చివరి కర్మలు ఆత్మ శాంతికి, పంచభూతాల్లో శరీరం కలవడానికి ఉద్దేశించినవి. చితి వద్ద నిర్వహించే కుండ కర్మ ఈ క్రతువులో అత్యంత కీలకమైనది.
Read Also: Astrology: గ్రహాల ప్రకారం సాంప్రదాయ పిండి పదార్థాలు

ప్రతీకాత్మక అర్థం:
ఈ ఆచారంలో కుండను ‘మానవ శరీరం’తోనూ, అందులోని నీటిని ‘ఆత్మ’తోనూ పోలుస్తారు. కుండకు రంధ్రాలు చేసి నీరు కారేలా చేయడం అంటే.. ఆత్మ మెల్లమెల్లగా భౌతిక శరీరంపై మమకారాన్ని(Funeral Rituals) వదులుకుని, ప్రాణం దేహాన్ని విడిచి వెళ్లే ప్రక్రియకు సంకేతం. చివరగా కుండను పగలగొట్టడం ద్వారా సదరు వ్యక్తికి ఈ లోకంతో, ఈ శరీరంతో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని అర్థం. పంచభూతాలతో నిర్మితమైన దేహం మళ్లీ ప్రకృతిలో కలిసిపోయిందని ఇది సూచిస్తుంది.
సైంటిఫిక్ కారణం:
కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఇందులో ఒక సామాజిక భద్రతా కోణం కూడా ఉంది. చితి చుట్టూ నీరు చల్లుతూ తిరగడం వల్ల మంటల తీవ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల నిప్పు రవ్వలు పక్కకు వ్యాపించకుండా, అంత్యక్రియలకు వచ్చిన వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: