India Russia oil trade : రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం ఇప్పుడు ధరలను పెంచింది. డిస్కౌంట్కు బదులుగా ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించింది. మిడిల్ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా తన ధరల విధానాన్ని మార్చుకుంది.
డిస్కౌంట్ నుంచి ప్రీమియంకు ఎందుకు ఈ నిర్ణయం?
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భారత్కు బ్యారెల్కు 15 నుంచి 30 డాలర్ల వరకు తక్కువ ధరకే చమురును సరఫరా చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారడంతో రష్యా అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్కు 2 నుంచి 5 డాలర్లు ఎక్కువగా వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 90 డాలర్ల వద్ద ఉంది. దీంతో రష్యా భారత్కు ఇకనుంచి బ్యారెల్కు సుమారు 92 నుంచి 95 డాలర్ల వరకు ధరకు చమురును విక్రయించే అవకాశం ఉంది.
Read Also: Washing machine offers : రూ.19 వేలు వాషింగ్ మెషీన్ ఇప్పుడు ఏడు వేలకే భారీ ఆఫర్

హర్ముజ్ జలసంధి ప్రభావం భారత్కు పెద్ద సమస్య?
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ద్వారా భారత్కు దాదాపు 50 శాతం చమురు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఆ మార్గంలో రవాణాకు ఆటంకం ఏర్పడడంతో ఇండియన్ రిఫైనరీలు ప్రత్యామ్నాయంగా రష్యా వైపు చూస్తున్నాయి. దీంతో రష్యా చమురుకు డిమాండ్ పెరిగి, మార్కెట్ ధరలు కూడా పెరిగాయి.
ఇంధన ధరల ప్రభావం.. ప్రజలపై పెరిగే భారం?
చమురు దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వంట గ్యాస్ (LPG) ధరలు కూడా సుమారు 7 శాతం పెరిగినట్లు సమాచారం. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతుంది.
దూర మార్గం పెరిగిన రవాణా ఖర్చులు
ప్రస్తుతం మిడిల్ఈస్ట్ సంక్షోభం కారణంగా చమురు నౌకలు ఆఫ్రికా దిగువ భాగంలో ఉన్న ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గం ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో సముద్ర బీమా, సరుకు రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. రష్యా బాల్టిక్ ఓడరేవుల వద్ద చమురు కొంత చౌకగా ఉన్నప్పటికీ భారత్కు చేరేసరికి ధరలు పెరిగిపోతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: