Odisha Crime: ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఇందకోలి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక మేకను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు విద్యార్థులపై గ్రామస్థులు మూకదాడికి దిగారు. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు, మరో బాలుడు మేకను దొంగిలించారని ఆరోపిస్తూ గ్రామస్థులు వారిని తాడుతో కట్టి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Chittoor Accident: లారీని ఢీకొన్న కారు.. మృతుల వివరాలు,ప్రమాదంపై పలువురు దిగ్భాంతి

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: