విజయవాడ :అమరావతి రాజధాని విస్తరణ, నిర్మాణం కోసం భూములు ఇస్తున్న రైతులకు వాటిపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ బుధవారం ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. అమరావతి మండలం ఎండ్రాయిలో సాయంత్రం గ్రామ సభనిర్వహించనున్నారు. తుళ్లూరు, అమరావతి Amaravati మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం 16,666.57 ఎకరాలను సర్కార్ సమీకరించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూసమీకరణ చేపట్టింది.
Read also: AP: రిపబ్లిక్ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

Loan waiver for farmers who are giving their lands
సీఎం అంగీకారం… రుణమాఫీ ఖాయం
అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వేట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది. రైతులకు స్థలాలు కేటాయించే లే ఔట్ల అభివృద్ధికి అథారిటీ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లే ఔట్లలో మొదట రెండు వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది. గతంలో భూసమీకరణలో భాగంగా స్థానిక రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఇప్పుడు కూడా రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ అడిగారని, సిఎం చంద్రబాబుతో ఈ విషయమై మాట్లాడానని తెలిపారు. ముఖ్యమంత్రి దీనికి అంగీకరించారనీ, 6 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: