Sonal Chauhan: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం సైతం యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అటు ఇరాన్ దెబ్బకు గల్ప్ దేశాలు దుబాయ్, రియాద్, అబుదాబీ సైతం మిస్సైల్ల దాడులతో వణికిపోతున్నాయి.ఈ క్రమంలోనే ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. విమాన సర్వీసులు సైతం నిలిపివేయడంతో అక్కడ పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ క్రమంలో నటి సోనాల్ చౌహాన్ దుబాయ్ లో చిక్కుకుపోయారు.
Read Also: Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం
ప్రధాని మోదీకి విజ్ఞప్తి
అయితే తన పరిస్థితిని ప్రధానికి సోషల్ మీడియా వేదికగా సోనల్ వివరిస్తూ.. “గౌరవనీయులైన ప్రధాని మోదీ గారు, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వల్ల నేను దుబాయ్లో చిక్కుకుపోయాను. విమానాలన్నీ రద్దయ్యాయి, భారత్కు తిరిగి రావడానికి మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి తగిన మార్గదర్శకాలు అందించి, నేను క్షేమంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేయాలని కోరుతున్నాను” అని సోనాల్ చౌహాన్ పోస్ట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: