ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025లో భాగంగా, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతోంది. టాస్లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే గెలిచి, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు.ఈ సీజన్లో ఇరు జట్లు సరిసమానంగా ఉన్నాయి. నాలుగు నాలుగు మ్యాచ్లు ఆడిన రెండు జట్లు కూడా రెండ్రెండు విజయాలను సొంతం చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో కోల్కతా ఐదులో ఉండగా, లక్నో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
డకౌట్
ఈ ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ మొత్తం మీద కూడా కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధికంగా సన్రైజర్స్ హైదరాబాద్పై 15 పరుగులు చేయగా, ఢిల్లీపై డకౌట్ అయ్యాడు. పంజాబ్పై రెండు, ముంబైపై రెండు పరుగులు మాత్రమే చేశాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రోజు కోల్కతాతో జరిగే మ్యాచ్లో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని పంత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో పది మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్తో కమ్ బ్యాక్ ఇచ్చి పాత పంత్ బయటకు రావాలని లక్నో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
విజయం
ఐపీఎల్లో ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్లు ఆడాయి. అందులో లక్నోదే పైచేయిగా ఉంది. కేకేఆర్ కేవలం రెండు మ్యాచ్లు గెలవగా, లక్నో మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్లో మాత్రం కేకేఆర్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు
క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
ఎయిడెన్ మర్కరమ్, మిచ్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్థూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.
Read Also: Rajat Patidar: రజత్ పాటిదార్ కు రూ.12 లక్షల జరిమానా