ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక బస్సు లు

KSRTC: ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక

మరో రెండు రోజుల్లో ఉగాది ఇంకా ఈద్ పండుగలు రాబోతున్నాయి. అయితే ఈసారి ఉగాది పండుగ ఆదివారం, ఈద్ సోమవారం రోజున రానుంది. దీనికి తోడు రేపు శనివారం, దింతో స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఉద్యోగాలు చేసేవారికి వరుసగా హాలీడేస్ రానున్నాయి. ఈ తరుణంలో ఉగాది ఇంకా ఈద్ అల్-ఫితర్ పండుగల సందర్భంగా సొంత ఊరు, ప్రయాణాలు చేసేవారికి సౌకర్యాలు కల్పించడానికి అదనపు బస్సులను నడపనున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తాజాగా ప్రకటించింది. ఈ రోజుల్లో అంచనా వేసినట్లుగా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ పండుగల సమయంలో 2 వేల అదనపు బస్సులు నడపనున్నట్లు కర్ణాటక స్టేట్ RTC తెలిపింది.

ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక బస్సు లు

బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు
మార్చి 30న ఉగాది పండుగ, మార్చి 31న ఈద్ అల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉండటంతో బెంగళూరుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వివరాలు అందిస్తూ పేర్కొన్నారు. మార్చి 28 నుండి 30 మధ్య బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి 31 వరకు సర్వీసులు అందుబాటులో

ఈ గమ్యస్థానాల నుండి కర్ణాటక రాజధానికి తిరిగి వచ్చే సర్వీసులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని అధికారిక ప్రకటన సూచించింది. మరిన్ని వివరాలను అందిస్తూ బెంగళూరులోని కెంపెగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, శివమొగ్గ, హసన్, మంగళూరు, కుందపుర, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్బళ్లి, ధార్వాడ్ వంటి వివిధ గమ్యస్థానాలకు మరిన్ని బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. అంతే కాకుండా బెలగావి, విజయపుర, గోకర్ణ, సిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పాల, యాద్గిర్, బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు నడుస్తాయి.

Related Posts
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. Read more

indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారతీయులు చిక్కులోఅంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా కేసులో ముగ్గురు తమిళనాడుకు చెందిన భారతీయులు ఇండోనేషియాలో అరెస్టు అయ్యారు. 106 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా Read more

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..కీలక చర్చలు
Congress working committee meeting today.important discussions

న్యూఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ Read more

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో బస్సు నది‌లో పడింది.
pok

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో గిల్‌గిట్-బాల్టిస్టాన్ ప్రాంతంలో నవంబర్ 12న ఒక దుర్ఘటన జరిగింది. ఒక బస్సు, దాదాపు ఇరవై మంది వివాహ అతిథులను తీసుకుని, ఇండస్ నదిలో పడిపోయింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *