నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

Delhi judge cash: నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

పోలీసులు తీసిన వీడియోలో..
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పోలీసులు తీసిన వీడియోలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన ఈ విషయాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందజేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై వెంటనే స్పందించి, నివేదికలోని ఫొటోలు, వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా విచారణ ప్రారంభించనుంది. అయితే, విచారణకు సంబంధించిన తుది గడువును మాత్రం నిర్ణయించలేదు.
తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర
జస్టిస్‌ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలను ఖండించారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎవరూ గదిలో నగదు కట్టలు ఉంచలేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. ఇది తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర అని ఆయన పేర్కొన్నారు. తమ నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ మరియు కార్డులను ఉపయోగిస్తామని తెలిపారు.

Related Posts
ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం.. పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం
Places of Prayer Act.. Supreme Court impatient on petitions

ఆ పిటీష‌న్ల‌కు ఓ ప‌రిమితి ఉండాలి.. న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం పై ఇంకా పిల్స్ దాఖ‌లు అవుతున్నాయి. ఆ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ Read more

Realme: మార్కెట్లోకి కొత్త ఫోన్ రియల్ మీ
Realme: మార్కెట్లోకి కొత్త ఫోన్ రియల్ మీ

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రియల్‌మీ కంపెనీ రూపొందించిన రియల్‌మీ P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, Read more

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఎం. ఉదయనిధి స్టాలిన్ చేసిన "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అనే వివాదాస్పద వ్యాఖ్యలపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం Read more

శ్వేత విప్లవ పితామహుడిని స్మరించుకుంటూ జాతీయ పాల దినోత్సవం..
verghese kurien

ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారతదేశంలో నేషనల్ మిల్క్ డేను సెలబ్రేట్ చేయడం, పాలు మరియు పాల పరిశ్రమకు చేసిన అద్భుత కృషిని గుర్తించడానికి ప్రత్యేకమైన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *