Isuzu Motors India has expanded its service footprint in Telangana

తెలంగాణలో ఇసుజు మోటార్స్ ఇండియా విస్తరణ

హైదరాబాద్‌: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. మరియు ఈరోజు ఖమ్మంలో కొత్త ఇసుజు అధీకృత సేవా కేంద్రము (ఏఎస్‎సి) ప్రారంభించింది. తన సేవలు మరియు వినియోగదారు అనుభవాన్ని విస్తరిచడముపై బలమైన దృష్టితో, ఇసుజు మోటార్స్ ఇండియా ఖమ్మంలో బియాండ్ ఆటో కేర్ ను నియమించింది. ఇది తెలంగాణలో ఇసుజు యొక్క 3వ టచ్‎పాయింట్. ఈ సదుపాయము ఎస్‎వి పవర్ ప్లాజా, ఖమ్మంలో ఉంది మరియు ఈ ప్రాంతములో ఇసుజు వినియోగదారులకు అంతరాయంలేని సహకారాన్ని అందించుటకు ఇక్కడ ఆధునిక పనిముట్లు, అసలైన విడిభాగాలు, ల్యూబ్స్ మరియు సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు.

ఏఎస్‎సి సదుపాయము వినియోగదారుల సమక్షములో ఇసుజు మోటార్స్ ఇండియా మరియు బియాండ్ ఆటో కేర్ నుండి కంపెనీ అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా మాట్లాడుతూ.. “అంతరాయం లేని సర్వీస్ సహకారాన్ని మరియు వారి మొత్తం ప్రయాణములో మా వినియోగదారులతో అర్థవంతమైన సంబంధాన్ని నిర్ధారించుటకు దేశవ్యాప్తంగా మా నెట్వర్క్ యాక్సెస్ ను విస్తరించాలని మేము కట్టుబడి ఉన్నాము. అసాధారణ వినియోగదారు సంతృప్తి మా సేవా భావజాలానికి కేంద్రకము మరియు మా విశ్వసనీయమైన నెట్వర్క్ భాగస్వాముల మద్ధతుతో యాజమాన్య అనుభవాన్ని పెంచుటకు మేము కట్టుబడి ఉన్నాము. బియాండి ఆటో కేర్ తో మా సహకారము ఈ ప్రాంతములో మేము అందించాలని కోరుకునే అంతరాయములేని మరియు వ్యక్తిగతీకరించబడిన సేవా అనుభవాన్ని మెరుగుపరచుటకు మాకు తోడ్పడుతుందన్నారు.

image

కేతినేని నరసింహారావు, డీలర్ ప్రిన్సిపల్ ఆఫ్ బియాండ్ ఆటోకేర్ మాట్లాడుతూ.. “ఖమ్మంలో ఒక అధీకృత సేవా కేంద్రముగా ఇసుజు మోటార్స్ ఇండియాతో మా భాగస్వామ్యాన్ని ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అసాధారణ సేవను అందించడము మరియు అత్యధిక స్థాయి వినియోగదారు సంతృప్తిని నిర్ధారించుట మా ప్రాథమిక దృష్టిగా నిలిచింది అన్నారు. ఇక, ఒక అధీకృత ఇసుజు సేవా కేంద్రముగా, బియాండ్ ఆటో కేర్, ఇసుజు వాహనదారులకు అత్యుత్తమ సేవ మరియు సహకారాన్ని అందించుటకు కట్టుబడి ఉంది. నాణ్యమైన సేవ మరియు వినియోగదారు-కేంద్రక కార్యకలాపాల ద్వారా ఖమ్మం మరియు పరిసర ప్రాంతాలలోని ఇసుజు వినియోగదారుల కొరకు యాజమాన్య అనుభవాన్ని పెంచడము దీని లక్ష్యము.

Related Posts
రోడ్డు ప్రమాదంలో గంజాయి సరఫరా గుట్టు రట్టు
ganja

ఒడిశా నుంచి ఏపీ మీదుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న దుండగులు గంజాయి సరఫరా గుట్టు రట్టు అయ్యింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో, ఒడిశా నుండి మిలియాపుట్టి Read more

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. Read more

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
President Droupadi Murmu Address to the Houses of Parliament

న్యూఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన Read more

శబరిమలకు పోటెత్తిన భక్తులు
devotees visit sabarimala

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే Read more