IPL 2025: మ్యాచ్ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్

IPL 2025 :సంజు శాంసన్​కు జరిమానా విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్​కు మరో ఎదురుదెబ్బ తలిగింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా శాంసన్​కు రూ.24 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

Advertisements

ఓవర్ రేట్

​ఇటీవల చెన్నైతో మ్యాచ్​లో తొలిసారి స్లో ఓవర్​ రేట్​కు గురైంది.ప్రస్తుత సీజన్​లో స్లో ఓవర్ రేట్​కు గురవ్వడం రాజస్థాన్​కు ఇది రెండోసారి. అయితే ఆ మ్యాచ్​లో శాంసన్ కెప్టెన్ కాకపోయినా, అతడికి భారీ జరిమానా తప్పలేదు. అంతేకాకుండా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2ను రాజస్థాన్ రెండోసారి ఉల్లంఘించినందుకు కెప్టెన్​తోపాటు జట్టు ప్లేయర్ల (ఇంపాక్ట్​ ప్లేయర్​ సహా)కు కూడా జరిమానా పడింది.

ఒక్కో వికెట్

బుధవారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.2 ఓవర్లలో 159కే ఆలౌట్ అయ్యింది. హెట్‌మయర్‌ (52 పరుగులు), శాంసన్‌ (41 పరుగులు), పరాగ్‌ (26 పరుగులు) మాత్రమే రాణించారు. జైస్వాల్ (6), నితీశ్‌ రాణా (1), ధ్రువ్ జురెల్ (5), శుభమ్‌ దూబె (1) విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 217-6 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (82 పరుగులు), జోస్ బట్లర్ (36 పరుగులు), షారుక్ ఖాన్‌ (36 పరుగులు) రాణించగా, రాహుల్ తెవాతియా (24* పరుగులు) చివర్లో దూకుడుగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, తుషార్ దేశ్‌పాండే 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. కాగా, తాజా గెలుపు గుజరాత్​కు నాలుగో విజయం కాగా, రాజస్థాన్​కు ఐదింట్లో మూడో ఓటమి.

  IPL 2025 :సంజు శాంసన్​కు జరిమానా విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ

ఈ ఐపీఎల్ సీజన్‌లో పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు చెందిన దిగ్వేష్‌ రాఠీకి మూడుసార్లు జరిమానా విధించగా అదే సమయంలో రిషబ్ పంత్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొదటి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలకు సైతం జరిమానా విధించారు.

Read also: IPL 2025 :రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ విజయం

Related Posts
ఐపీఎల్ 2025 ప్రారంభ తేదీని ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ 2025 ప్రారంభ తేదీని ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మార్చి 23 న ప్రారంభమవుతుందని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధృవీకరించారు. జనవరి 12 ఆదివారం నాడు జరిగిన బిసిసిఐ Read more

Baba Siddique Murder: బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
baba siddique

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దుశ్చర్య మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా Read more

పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన భారత్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం
ind vs aus

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. భారత్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా Read more

డాలర్ల క్లబ్ నుంచి అంబానీ, అదానీ ఔట్!
WhatsApp Image 2024 12 17 at 1.28.34 PM

ముకేశ్ అంబానీ, గౌతం అదానీలు భారత వ్యాపారంలో దిగ్గజాలు. బిలియన్ డాలర్ల వ్యాపారంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×