हिन्दी | Epaper

Visakhapatnam: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు

Anusha
Visakhapatnam: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం మరో కీలక అంతర్జాతీయ కనెక్టివిటీ సాధించింది. విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధులు తెలిపారు. జూన్ 13 (శుక్రవారం) నుంచి ఈ విమాన సర్వీసు అధికారికంగా ప్రారంభంకానుంది.అలాగే విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య విమాన సర్వీసులు జూన్‌ 15 నుంచి ప్రారంభంకానుంది.

విమాన సర్వీసు

ఈ విమానం మధ్యాహ్నం 1.55కి విశాఖపట్నం చేరుకొని తిరిగి 2.25కి భువనేశ్వరకు వెళ్తుంది అన్నారు.ఇటు జూన్‌ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు(Air India Express Service)లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ జులై 2 నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసును ప్రారంభించనుంది.

మంచి స్పందన

మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ జులై 2 నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసును ప్రారంభించనుంది. దక్షిణ భారత సేల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ సచ్‌దేవా ఈ విషయాన్ని తెలిపారు.విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్‌లకు కూడా విమాన సర్వీసులు నడపాలని ఏపీ ఛాంబర్స్‌(AP Chambers) కోరింది. గతంలో సింగపూర్‌కు ఇండిగో విమానాలు నడిపినప్పుడు మంచి స్పందన వచ్చిందని ఛాంబర్స్‌ గుర్తు చేసింది. ఈ మేరకు సౌరభ్‌ సచ్‌దేవా బృందం ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్‌రావుతో సమావేశమైంది. గతంలో ఇండిగో సింగపూర్‌కు విమానాలు నడిపినప్పుడు 80 శాతం సీట్లు నిండాయని గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్‌లకు విమాన సర్వీసులు చాలా అవసరమన్నారు.

Visakhapatnam: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు
Visakhapatnam

సాంస్కృతిక

పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,ఆంధ్రా నుంచి త్వరలో ప్రారంభంకానున్న ఈ సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నారు.ఈ కొత్త విమాన సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశంలో ప్రధాన టెక్‌ హబ్‌(Tech Hub)లలో ఒకటైన బెంగళూరుకు అనుసంధానం కావొచ్చు అన్నారు. ఇటు విశాఖ-భువనేశ్వర్‌ సర్వీసుతో రెండు తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుంది అన్నారు.

ఆర్థికాభివృద్ధికి దోహదం

ఈ విమాన మార్గం కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని వ్యాపార, టూరిజం, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ విమాన మార్గం అనుకూలంగా నిలుస్తుంది. దీంతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, విదేశీ పర్యాటకుల రాక కూడా మరింతగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Read Also: TTD: టీటీడీ ఉద్యోగుల సమస్యలపై శ్యామల రావు కీలక ఆదేశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

📢 For Advertisement Booking: 98481 12870