हिन्दी | Epaper

Telugu News:Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ.. బాలికపై సామూహిక అత్యాచారమే కారణమా

Pooja
Telugu News:Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ.. బాలికపై సామూహిక అత్యాచారమే కారణమా

నేరాలు.. హింసలతో బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతున్నది. యువత రోడ్డుపై వచ్చి హింసాత్మక ఘటనతో ఏకంగా ఆదేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్లో తలదాల్చుకుంటున్నది. తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యునస్ ఉన్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్ లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా జతుల మధ్య చిచ్చు రాజేసింది. ఆదివాసీ తెగలకు, వలస వచ్చిన బెంగాలీ వర్గాలకు మధ్య చెలరేగిన తీవ్ర ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సైనికులు, పోలీసులు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భారీగా భద్రతా(Heavy security) బలగాలను మోహరించినా, హింస అదుపులోకి రాకపోవడంతో ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.

Read Also: China Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రాండ్ కెన్యన్ వంతెన చైనా లో ప్రారంభం

Bangladesh

అత్యాచారానికి గురైన బాలిక

భారత్-మయన్మార్ సరిహద్దుల సమీపంలోని చిట్టగాంగ్ కొండ ప్రాంతమైన ఖద్రాచారి జిల్లాలో మంగళవారం ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం నుంచి నిరసనలు ఉదృతం చేసి, టైర్లు కాల్చి, చెట్లను అడ్డంగా వేసి రహదారులను దిగ్బంధం చేశాయి. దీంతో ఆదివారం నాటికి ఈ ఆందోళనలు హింసాత్మక(Violent) ఘర్షణలుగా మారాయి.

ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు

ఖగ్రాఛారి జిల్లా కేంద్రంలో మొదలైన అల్లర్లు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇరువర్గాల వారు ఒకరి వ్యాపార సమూదాయాలపై, ఇళ్లపై మరొకరు దాడులు చేసుకుంటూ నిప్పు పెట్టారు. దీంతో జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ మీడయాకు చెప్పారు. ఈ ఘర్షణలో 13మంది సైనికులు, ముగ్గురు పోలీసులు కూడా గాయపడినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. జిల్లా యంత్రాంగం 144 సెక్షన్ ను విధించింది. సైన్యం, సరిహద్దు భద్రతాదళం, పోలీసులు గస్తీ కాస్తున్నారు. బాలికపై అత్యాచారం కేసులో సైన్యం సాయంతో ఓ బెంగాళీ యువకుడిని అరెస్టు చేశారు. 

ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది?
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతం, ఖద్రాచారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

బలాత్కారం బాధితుడు ఎవరు?
ఎనిమిదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక, ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ సంఘటనకు గురయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870