हिन्दी | Epaper

Telugu News: USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

Sushmitha
Telugu News: USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఇటీవల ఢిల్లీలో(USA) జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. భారతదేశానికి ఇదెంతో వ్యథను పుట్టించే సంఘటన. టెర్రరిస్టులు సామాన్యప్రజల ప్రాణాలను టార్గెట్ చేస్తూ, చేస్తున్న బాంబు దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబు పేలుడు కేసుపై భారత అధికారులు చాలావేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి వెనుక ఎవరు ఉన్నారనేది కనిపెట్టేశారు.

Read Also: TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డి.. కల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్

USA
USA

పేలుడుపై రూబియో కీలక వ్యాఖ్యలు

దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని.. కానీ ఆ అవసరం భారత్ కు లేదని వ్యాఖ్యానించారు.

కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఢిల్లీ పేలుడు కేసు విచారణకు ఎన్ ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కొత్త రాయబారి సెర్గియోగోర్ అన్నారు.

మార్కోరూబియోతో జయశంకర్ భేటీ

ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్,(Minister S. Jaishankar) మార్కోరూబియోతో భేటీ అయ్యారు. ఇరువురూ మంత్రులూ భారత, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పేలుడుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870