हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

USA: WHOతో సంబంధాలపై అమెరికా కీలక నిర్ణయం

Saritha
USA: WHOతో సంబంధాలపై అమెరికా కీలక నిర్ణయం

కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా (USA) ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి వెళ్లే అన్ని రకాల నిధులను నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు తెలిపింది.

Read Also: Diwakar Reddy: యువ నేత నారా లోకేష్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు

USA: WHOతో సంబంధాలపై అమెరికా కీలక నిర్ణయం
America makes a key decision regarding its relationship with the WHO.

మిలియన్ డాలర్లు బకాయి పడిన అమెరికా

డబ్ల్యూహెచ్ఓ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అయితే, పరిమిత పరిధిలో డబ్ల్యూహెచ్ఓతో కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుందని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ట్రంప్ (Trump) రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ సంస్థ నుంచి వైదొలుగుతామని పలుమార్లు హెచ్చరించారు. తాజాగా, అమెరికా అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగే సమయానికి అమెరికా ఆ సంస్థకు భారీ మొత్తంలో బకాయి పడింది. 260 మిలియన్ డాలర్ల బకాయిలను అమెరికా డబ్ల్యూహెచ్ఓకు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,382 కోట్లు. ఈ బకాయిని పూర్తిగా చెల్లించే వరకు డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా ఉపసంహరణ పూర్తి కాదని ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు. అయితే, సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలు చెల్లించాలనే నిబంధన ఏమీ లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870