हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Houthi: హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు

Vanipushpa
Houthi: హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు

యెమెన్​లోని హూతీ ఉగ్రవాదులపై ఆదివారం రాత్రి చేసిన క్షిపణి దాడిలో సుమారు 30 మంది మరణించారు. హూతీల ఏరివేత లక్ష్యంగా మార్చి 15 నుంచి అమెరికా వారిపై యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో నెలన్నరలో ఇప్పటివరకు హూతీలపై సుమారు 800 క్షిపణులతో దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్​ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. తమ దూకుడు వల్ల అంతర్జాతీయ నౌకలపై హూతీల దాడులు తగ్గినట్లు తెలిపింది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు 69శాతం, డ్రోన్​ దాడులు 55శాతం తగ్గినట్లు వివరించింది.

హూతీలపై  అమెరికా భారీ క్షిపణులతో దాడులు

మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం
హూతీలపై దాడుల తీవ్రతను మరింత పెంచుతాం. వారు నౌకలపై దాడులను నిలిపివేసి ప్రశాంత వాతవారణం వచ్చేవరకు దాడులు చేస్తాం. ఆపరేషన్​ రఫ్​రైడర్​ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 800 క్షిపణి దాడులు చేశాం. దీంతో వందలాది హూతీ ఉగ్రవాదులతో పాటు నేతలు, అధికారులు మరణించారు. ఇంకా అనేక కార్యాలయాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తి, భద్రత వ్యవస్థలను ధ్వంసం చేశాం అని అమెరికా సెంట్రల్ కమాండ్​ వెల్లడించింది.
దాడులు కొనసాగిస్తాం
హూతీల ఉగ్రవాద కార్యకలపాలకు ఆదాయం అందించే రాస్ ఇసా చమురు పోర్ట్​ పైన దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ వైమానిక దాడుల్లో 74 మంది మృతి చెందగా, మరో 171 మందికి గాయాలయ్యాయి. హూతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే దాడులు చేపట్టామని తెలిపింది. దీని ఆధారంగానే హూతీలు మిలియన్​ డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వివరించింది.
ఇప్పటికీ హూతీలకు ఇరాన్​ సాయం చేస్తూనే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్​ మద్దతు వల్లే తమ దళాలతో హూతీలు పోరాడగలుతున్నారని అభిప్రాయంపడింది. తమ లక్ష్యమైన స్వేచ్ఛాయుత నౌకాయనం జరిగేవరకు దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అటు హూతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. హూతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య, యుద్ధ నౌకలపై దాడులు ఆపాలనే లక్ష్యంతో యెమెన్‌లోని హౌతీలపై మార్చి 15న అమెరికా సైనిక చర్యను మొదలుపెట్టింది.

Read Also: India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870