हिन्दी | Epaper

అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు

Sudheer
అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు

అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కో వలసదారుని పంపించేందుకు సుమారు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో సాధారణ విమానాల్లో ప్రయాణం కంటే ఐదింతలు అధిక వ్యయం అవుతోంది.

వలసదారులను తరలించేందుకు అమెరికా సాధారణ వాణిజ్య విమానాల స్థానంలో మిలటరీ విమానాలను ఉపయోగిస్తోంది. సీ-17, సీ-130ఈ మిలటరీ విమానాల్లో వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. సాధారణ విమానాల్లో టికెట్ ధర 853 డాలర్లుగా ఉంటే, మిలటరీ విమానాలను ఉపయోగించడం వల్ల ఖర్చు భారీగా పెరిగింది.

trump
trump

ఈ మిలటరీ విమానాల నిర్వహణ ఖర్చు అత్యధికంగా ఉంది. గంటకు రూ.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లు వరకు వ్యయం అవుతుందని అంచనా. దీని వల్ల అమెరికా ప్రభుత్వం వలసదారులను పంపించడంపై ప్రతిరోజూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, వారిని తరలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే అధిక ఖర్చు వల్ల ఈ చర్యలు మరింత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ ఖర్చుల పెరుగుదలపై అమెరికాలో రాజకీయంగా చర్చ జరుగుతోంది. అక్రమ వలసదారుల సమస్యను చక్కదిద్దడానికి దీన్ని సరైన విధానం కాదని విమర్శలు వస్తున్నాయి. మరికొంతమంది నేతలు మాత్రం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను సమర్థిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870