టైఫూన్ రాగస(Typhoon Ragasa) తైవాన్లో బీభత్సం (Disaster)సృష్టించింది. ఓ సరస్సు తెగిపోవడంతో సుమారు 15 మంది మృతిచెందారు. కొండల నుంచి సునామీ వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ బృందం పనితీరుపై తైవాన్ ప్రధాని చో జుంగ్ తాయి దర్యాప్తునకు ఆదేశించారు. తైవాన్లో మరో 17 మంది మిస్సింగ్లో ఉన్నారు. గువాంగ్ఫు టౌన్షిప్లో ఎక్కువగా మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోనున్నట్లు చో వెల్లడించారు. గువాంగ్పులోని శరణార్థ క్యాంపులోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రాణనష్టం సంభవించింది. ఆ స్కూల్ క్యాంపులో ఉన్న చైర్లు, టేబుళ్లు, రిఫ్రిజిరేటర్లు, కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.

మరో వైపు టైఫూన్ రాగస (Typhoon Ragasa)దక్షిణ చైనాలోకి ప్రవేశించింది. గువాంగ్డాంగ్ ప్రావిన్సు వద్ద తీరాన్ని తాకింది. తీరం వద్ద గంటకుసుమారు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హాంగ్కాంగ్లో కూడా భారీ నష్టం జరిగింది. సుమారు 63 మంది గాయపడ్డారు. అయితే సూపర్ టైఫూన్ కేటగిరీని హాంగ్కాంగ్ తగ్గించింది. కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూలాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద టైఫూన్ ఏది?
టైఫూన్ హైయాన్ (2013) ల్యాండ్ ఫాల్ వద్ద బలమైన గాలుల రికార్డును కలిగి ఉంది, ఇది నమోదైన చరిత్రలో భూమిని తాకిన బలమైన ఉష్ణమండల తుఫానుగా నిలిచింది. మరొక మెట్రిక్ మొత్తం పవన క్షేత్రం, ఇక్కడ టిప్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఉష్ణమండల తుఫాను-శక్తి గాలులు దాని గరిష్ట స్థాయి తర్వాత చాలా రోజుల పాటు 1,100 కిమీ (684 మైళ్ళు) కంటే ఎక్కువ విస్తరించి ఉంటాయి.
ఏ దేశంలో ఎక్కువ టైఫూన్లు వీస్తాయి?
పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉపఉష్ణమండల శిఖరం ద్వారా నియంత్రించబడతాయి, కొన్ని వ్యవస్థలు జపాన్ సమీపంలో మరియు తూర్పున తిరిగి తిరుగుతాయి. ఫిలిప్పీన్స్ తీరప్రాంతాల తీవ్రతను ఎదుర్కొంటుంది, చైనా మరియు జపాన్ తక్కువ తరచుగా ప్రభావితమవుతాయి. అయితే, చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన కొన్ని టైఫూన్లు చైనాను తాకాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: