అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ – 2025 (World Police & Fire Games – 2025) పోటీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి చెందిన సెక్యూరిటీ విభాగం అధికారులు అత్యద్భుత క్రీడా ప్రతిభను ప్రదర్శించి దేశానికి, సంస్థకు గర్వకారణంగా నిలిచారు.ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీస్, ఫైర్ సర్వీస్, కస్టమ్స్, జైలు సిబ్బంది వంటి ప్రజల రక్షణ కోసం పనిచేసే ఉద్యోగుల కోసం నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం ఒక ప్రైవేట్ అంతర్జాతీయ వేదిక (Private international platform) పై నిర్వహించబడే ఈ పోటీలు క్రీడా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, దేశాల మధ్య స్నేహబంధాలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్
ఈ పోటీల్లో టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు తమ వయో విభాగాల్లో అద్భుత విజయాలు నమోదు చేశారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో, టీటీడీకి చెందిన విజీలెన్స్ ఆఫీసర్ ఎ. సురేంద్ర గారు ప్రత్యర్థులను ఓడిస్తూ అద్భుత ఆటతీరు కనబరిచి స్వర్ణ పతకాన్ని (Gold Medal) గెలుచుకున్నారు. అత్యంత క్లిష్టమైన మ్యాచ్లను కూడా విశేష నైపుణ్యంతో ఎదుర్కొని విజయం సాధించడం ఆయన క్రీడా పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపింది.ఇక 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో, టీటీడీకి చెందిన మరో విజీలెన్స్ అధికారి ఎన్.టి.వి. రామ్ కుమార్ గారు పోటీలో విశేషంగా రాణించి కాంస్య పతకాన్ని (Bronze Medal) సాధించారు. ఆయన ఆటలోని చొరవ, మానసిక దృఢత్వం ప్రతిష్టాత్మక బహుమతిని గెలుచుకునేలా చేసింది.

విజేతలను అభినందించారు
వయసుతో సంబంధం లేకుండా ఆయన చూపిన ఆటతీరు యువ క్రీడాకారులకు కూడా ప్రేరణగా నిలిచే విధంగా ఉంది.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9వేల మంది అథ్లెట్లు పాల్గొన్న పోటీల్లో టీటీడీ (TTD) అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీ.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Payyavula Keshav: పరామర్శల పేరుతో జగన్ అరాచకం చేస్తున్నాడన్న మంత్రి పయ్యావుల