हिन्दी | Epaper

Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

Anusha
Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన వివరాలను స్కెచ్‌లు, రేఖాచిత్రాలు, ఆడియో నోట్స్ రూపంలో పాక్ ఏజెంట్‌(Pak agent)కు పంపించి, ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.థానే సమీపంలోని కల్వా ప్రాంతానికి చెందిన రవీంద్ర వర్మ ఓ ప్రైవేటు డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతడికి దక్షిణ ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లోకి ప్రవేశం ఉండేదని, తరచూ యుద్ధనౌకలు, జలాంతర్గాములపైకి కూడా వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐవో) వలపు వలలో చిక్కాడు.

ఏజెంట్‌

రవీంద్ర వర్మ ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు రహస్య సమాచారాన్ని పంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ సమాచారానికి బదులుగా అతడు భారత్, విదేశాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు అందుకున్నాడు” అని ఒక అధికారి తెలిపారు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల గురించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్టు మరో అధికారి తెలిపారు.నేవల్ డాక్‌యార్డ్‌(Naval Dockyard) సందర్శనల సమయంలో మొబైల్ ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడంతో వర్మ తన పని ముగించుకుని బయటకు వచ్చాక యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని స్కెచ్‌లు, రేఖాచిత్రాల రూపంలో పంపేవాడని, కొన్నిసార్లు ఆడియో నోట్స్ ద్వారా కూడా సమాచారం ఇచ్చేవాడని అధికారులు పేర్కొన్నారు. జలాంతర్గాములు, యుద్ధనౌకల పేర్లను కూడా పాక్ ఏజెంట్‌తో పంచుకున్నాడని ఏటీఎస్ అనుమానిస్తోంది.

Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత
Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

అధికారి

2024 నవంబర్ నుంచి వర్మ పాకిస్థాన్ ఏజెంట్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. 2024లో ‘పాయల్ శర్మ’, ‘ఇస్ప్రీత్’ అనే ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు రాగా, వాటిని అంగీకరించాడు. ఈ రెండు ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులు మహిళలుగా నటిస్తూ, తాము భారతదేశానికి చెందినవారమని, యుద్ధనౌకల సమాచారం అవసరమైన ఓ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని నమ్మబలికారు. కొద్దిరోజుల సంభాషణల తర్వాత, వారు వర్మను హనీట్రాప్‌లో దింపి, కీలకమైన సంస్థాపనల గురించి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడం ప్రారంభించారని, వర్మ ఆ సమాచారాన్నంతా పాక్ ఏజెంట్లకు చేరవేసేవాడని అధికారులు వివరించారు.తాను ఏమి చేస్తున్నాడో, ఎవరికి సున్నితమైన సమాచారం అందిస్తున్నాడో అతనికి పూర్తిగా తెలుసు. సమాచారం అందించినందుకు ప్రతిఫలంగా డబ్బు కూడా పొందుతున్నాడు” అని ఓ అధికారి స్పష్టం చేశారు. నిందితుడైన రవీంద్ర వర్మను అరెస్ట్ చేసిన ఏటీఎస్(ATS) అధికారులు, కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి సోమవారం వరకు ఏటీఎస్ కస్టడీ విధించింది.  

Read Also: UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

📢 For Advertisement Booking: 98481 12870