ఉన్నత చదువులు చదివి, అమెరికా(America)లో మంచి ఉద్యోగం సంపాదించి, మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో విషాదాన్ని నింపింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోశిక యశ్వంత్ కుమార్ (33) అమెరికాలోని డాలస్లో సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్కు చెందిన గోశిక వెంకటేశం, గాయత్రీ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో యశ్వంత్ రెండో కుమారుడు. గత కొంతకాలంగా డాలస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యశ్వంత్, సోమవారం నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో గమనించిన స్నేహితులు.. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Read Also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

ఏడాది ఫిబ్రవరి 21న వివాహానికి ముహూర్తం
అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. యశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. పెళ్లి పనుల కోసం మరికొద్ది రోజుల్లోనే స్వగ్రామానికి వచ్చేందుకు యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లికొడుకుగా చూడాలనుకున్న బిడ్డను విగతజీవిగా చూడాల్సి రావడం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: