हिन्दी | Epaper

పాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శిఖర్ ధవన్

Anusha
పాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శిఖర్ ధవన్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌లో పర్యటించకూడదన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించాడు. క్రికెట్ కంటే దేశ భద్రతే ముఖ్యమని స్పష్టం చేశాడు. ‘పాకిస్థాన్‌లో భారత జట్టు ఆడాలని మీరు అనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు ధవన్ మాట్లాడుతూ అలా అనుకోవడం లేదని, దేశ వైఖరికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లకూడదని పేర్కొన్నాడు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధవన్ స్పష్టం చేశాడు. తొలుత ప్రభుత్వాలు ఒక మాటపై ఉండాలని, ఆ తర్వాత అది క్రికెట్ బోర్డుకు వర్తిస్తుందని ధవన్ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆటగాళ్లకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని దేశం నిర్ణయిస్తే దానికి తాము కట్టుబడి ఉంటామని వివరించాడు.

afo4cus shikhar dhawan afp 625x300 23 July 22

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో పర్యటించడాన్ని భారత జట్టు ఎప్పుడో రద్దు చేసుకుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ వచ్చేవారం ప్రారంభం కానుంది. అవసరమైతే టోర్నీ నుంచి వైదొలగేందుకు కూడా సిద్ధపడిన భారత జట్టు పాక్ వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.కాగా, అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ధవన్ 167 వన్డేలు ఆడాడు. 44.1 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 34 టెస్టుల్లో 40.6 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక, 68 టీ20లు ఆడిన ధవన్ 27.9 సగటు, 11 అర్ధ సెంచరీలతో 1,759 పరుగులు చేశాడు.

ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా

ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, అది క్రికెట్ బోర్డుపైనా వర్తిస్తుంది. ఆటగాళ్లకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దేశం ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు ఆటగాళ్లు కట్టుబడి ఉంటారు, అని స్పష్టం చేశాడు.

క్రికెట్ లెక్కలు కంటే దేశ భద్రతే ముఖ్యం

ధవన్ వ్యాఖ్యలు దేశ భద్రతపై ఆయనకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. క్రికెట్ క్రీడకారుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ధవన్, దేశ ప్రయోజనాలను ఎప్పుడూ ముందు నిలుపుతానని చెప్పాడు.


పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాలా,అనే ప్రశ్నకు
ప్రస్తుత పరిస్థితుల్లో అలా అనుకోవడం లేదు. భద్రతకే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉగ్రవాదం పూర్తిగా ముగిసే వరకు పాక్‌తో సాధారణ క్రీడా సంబంధాలు తిరిగి ప్రారంభించడం కష్టమే అని చెప్పడం గమనార్హం.

అభిమానుల స్పందన

ధవన్ వ్యాఖ్యలపై అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది దేశ భద్రత ముందు అని ధవన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొంతమంది క్రీడను రాజకీయాల నుంచి విడదీసుకోవాలంటున్నారు.శిఖర్ ధవన్ చేసిన వ్యాఖ్యలు స్ఫష్టంగా భారత ప్రభుత్వ, బీసీసీఐ వైఖరికి మద్దతుగా ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870