అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి ఆరోపించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని ఆయన ఎక్స్లో దుయ్యబట్టారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటేనే, భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్ అన్నారు.
Read Also: Digital India: కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం
ఒకవేళ మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఉంటే పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారుల శ్రేయస్సును రక్షించే విధంగా చర్చలు జరిపి ఉండేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ, ఆయన ప్రభుత్వం కలిసి రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా పత్తి, వస్త్ర పరిశ్రమ రంగాలపై ఆధారపడి ఉన్న కోట్లాది మంది భారతీయుల కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అనే గొయ్యిలోకి నెట్టివేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. గత వారం భారత్-అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో యూఎస్ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం వంటివి ఆ ఒప్పందంలో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: