हिन्दी | Epaper

Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

Anusha
Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధినేత,కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ఎన్నటికైనా భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. పీఓకే(POK) భారత్‌లో విలీనం కావాల్సిందేనని,అలా జరగకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మరిన్ని యుద్ధాలు చేయాల్సి వస్తుందని రాందాస్ అథవాలే హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ఆయన భారత సైన్యం ధైర్య సాహసాలు చూపించి పాకిస్తాన్ ఆర్మీకి తగిన గుణపాఠం చెప్పిందని తెలిపారు.పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి పాకిస్తాన్‌ను భారత్ తీవ్రంగా దెబ్బతీసిందని కేంద్రమంత్రి తెలిపారు. కాల్పుల విరమణ కొన్ని రోజులే ఉంటుందని భారత సైనికులు దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పారని వారిని కొనియాడారు. పాకిస్తాన్‌లో తలదాచుకున్న 100 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్యవర్తిత్వంతో ఈ ఆపరేషన్‌ను ముగించలేదని రాందాస్ అథవాలే తేల్చి చెప్పారు. పీఓకేను భారత్‌కు అప్పగించాలని,ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని పాకిస్తాన్ ముందు భారత్ ప్రతిపాదనలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

 Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే
పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

సమాధానం

ఇక కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని రాందాస్ అథవాలే(Ramdas Athawale) తేల్చి చెప్పారు.తూటాకు తూటా సమాధానం చెబుతుందనేది భారత వైఖరి అని పీఓకే భారత్‌లో భాగమని గతంలోనే తాము పార్లమెంటులోనూ చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ పీఓకేను పాక్ అప్పగించకుంటే తిరిగి భారత్‌లో కలుపుకునేందుకు మనం మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుందని రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిణామాలను రాజకీయం చేయవద్దని విపక్ష పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.పీఓకేను భారత్‌లో విలీనం చేయాలన్న రాందాస్ అథవాలే వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.

Read Also: Foreign Minister: పాకిస్థాన్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉంది: జైశంకర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

ఇరాన్ చేసిన దాడిలో భారతీయుడు మృతి
0:15

ఇరాన్ చేసిన దాడిలో భారతీయుడు మృతి

స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!

స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!

అమెరికా ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద భారీ వాణిజ్య దర్యాప్తు ప్రారంభించింది

అమెరికా ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద భారీ వాణిజ్య దర్యాప్తు ప్రారంభించింది

వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల

వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల

మిడిల్ ఈస్ట్ యుద్ధం తీవ్రతరం

మిడిల్ ఈస్ట్ యుద్ధం తీవ్రతరం

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

📢 For Advertisement Booking: 98481 12870