हिन्दी | Epaper

Latest Telugu News : PM Modi : భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ

Sudha
Latest Telugu News : PM Modi : భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ

‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. మన దేశం నిజమైన బలం ఏంటో శత్రుదేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లబాయి పటేల్‌ సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

Read Also : http://Randhir Jaiswal: 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం

 PM Modi
PM Modi

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత్‌ తన శత్రుదేశ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయగలదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి పంపిందన్నారు. ‘ఎవరైనా మనదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే.. భారత్ వారి భూభాగంలోకి చొరబడి మరీ దెబ్బకొడుతుందని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచమంతా చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో పాక్‌, ఆ ఉగ్రవాదులకు తెలిసింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వ దృఢ వైఖరి సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ ఆశయాలను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు.

మోడీ ఎన్నిసార్లు ప్రధాని అయ్యారు?

2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.

మోడీ స్వస్థలం ఏది?

నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత గుజరాత్)లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నేపథ్యం మరియు హిందూ విశ్వాసం కలిగిన గుజరాతీ కుటుంబంలో జన్మించారు.

Read hindi news :hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870