हिन्दी | Epaper

Operation Sindoor : పాక్ సైనికుల హతం.. మూడు నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్థాన్

Divya Vani M
Operation Sindoor : పాక్ సైనికుల హతం.. మూడు నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్థాన్

భారత వాయుసేన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట జరిపిన మెరుపు దాడుల్లో పాకిస్థాన్‌ (Pakistan)కి తీవ్ర నష్టం జరిగింది. ఎప్పటి నుంచి ఈ విషయం పాక్ మౌనంగా ఉండిపోయినా, ఇప్పుడు మాత్రం పరోక్షంగా ఒప్పుకోక తప్పలేదు.ఈ దాడిలో 13 మంది సైనికులతో పాటు మొత్తం 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ అంగీకరించింది. ఇదంతా వాళ్ల స్వాతంత్ర్య దినోత్సవం రోజునే బయటికి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.ఈ దాడికి బదులుగా మే 7న తెల్లవారుజామున భారత వాయుసేన ఆధునిక మిరాజ్ జెట్‌లతో పాక్‌ ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయి.

Operation Sindoor : పాక్ సైనికుల హతం.. మూడు నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్థాన్
Operation Sindoor : పాక్ సైనికుల హతం.. మూడు నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్థాన్

100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టుబడ్డారు

ఆపరేషన్ అనంతరం భారత ప్రభుత్వం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. దాడులన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌ అంతర్గత ప్రాంతాలపై జరిగాయి.పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ దాడుల్లో మరణించిన సైనికులకు మరణానంతరం పురస్కారాలు ప్రకటించింది. ఇదే పరోక్షంగా భారత్ దాడుల ప్రభావాన్ని అంగీకరించినట్లు అనిపిస్తోంది.భోలారీ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్‌కు ‘తమ్ఘా-ఇ-బసాలత్’ పురస్కారం ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా మరణానంతర గౌరవాలు అందించారు.

గాయపడిన వారిలో విదేశీ టెక్నీషియన్లు కూడా ఉన్నారు

నూర్ ఖాన్, షోర్‌కోట్, జాకోబాబాద్ వంటి ఎయిర్‌బేస్‌లపై దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో కొంతమంది అమెరికన్ టెక్నీషియన్లు కూడా గాయపడ్డారు.ఇన్నాళ్లు నిజం దాచిన పాకిస్థాన్, ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాన్ని బయటపెట్టక తప్పలేదు. ఇది పరోక్షంగానే అయినా, భారత్ నిర్వహించిన దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రపంచానికి తెలియజెప్పినట్టే.పాకిస్థాన్ అధికారికంగా ఒప్పుకోకపోయినా, అవార్డుల ప్రకటనతో సత్యం వెలుగులోకి వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ తలపెట్టిన దెబ్బ వల్ల పాక్‌కి తలదించుకునే పరిస్థితి వచ్చింది.

Read Also :

https://vaartha.com/putin-spoke-in-english-at-a-press-conference/international/531377/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870