తాలిబన్ల దాడిలో భారీ నష్టం
పాకిస్తాన్(Pakistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఉత్తర వజీరిస్తాన్ జిల్లా(Vajirishan)లో ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్ అనుబంధ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్(Haphij gul bahadur group) కు చెందిన ఆత్మాహుతి బాంబర్, విస్ఫోటకాలు నిండిన వాహనాన్ని సైనిక కాన్వాయ్పైకి ఢీకొట్టాడు. ఈ ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరో 20 మందికిపైగా గాయపడ్డారు, వారిలో పౌరులు, పిల్లలు, పోలీసు సిబ్బంది, అధికారులు ఉన్నారు.
పౌరులపై ప్రభావం: పిల్లలు సహా గాయాలు
ఈ పేలుడుతో పక్కనే ఉన్న రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నపిల్లలు గాయపడ్డారు. స్థానిక పోలీసుల ప్రకారం, శిథిలాల కింద మరింతమంది ఉండే అవకాశముందని భావిస్తున్నారు. పునరావాస, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తాలిబన్ ప్రకటన – కుట్ర పక్కా!
ఈ దాడికి బాధ్యత హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ తీసుకున్నట్లు ప్రకటించింది.
దీని ద్వారా సైనిక కదలికలపై దాడులు జరపడానికి ముందుగానే పన్నిన కుట్ర అని పాక్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్ఘాన్ పొరుగు దేశం బాధ్యత వహించాలి: పాకిస్తాన్ ఆరోపణ
2021లో అఫ్గానిస్తాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, పాకిస్తాన్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక దాడులు పెరిగాయని ఇస్లామాబాద్ ఆరోపించింది.
2025లో ఇప్పటివరకు 290 మంది ప్రాణాలు కోల్పోయారు
AFP లెక్కల ప్రకారం, 2025 ప్రారంభం నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ రాష్ట్రాలలో దాదాపు 290 మంది, ముఖ్యంగా భద్రతా సిబ్బంది, తాలిబన్ మద్దతుదారుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ భద్రతా వ్యవస్థలపై కొనసాగుతున్న ఈ దాడులు పాక్ లోతైన ఉగ్రవాద సమస్యను మరోసారి బయటపెడుతున్నాయి.
Read Also: Donald Trump: 30 బిలియన్ డాలర్లు ఇస్తోందన్నవార్తలను ఖండించిన ట్రంప్