हिन्दी | Epaper

పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం

sumalatha chinthakayala
పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం

పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదన అధికారులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు పేలుడు జరగడంతో 10 మంది మరణించారు. కార్మికులతో వెళ్తున్న పికప్ వాహనంపై పేలుడు పదార్థంతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది వెంటనే మరణించారు. 6 మంది గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నైలో ఈ పేలుడు సంభవించింది.

రిమోట్‌తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోంద‌ని, ఏ గ్రూపు దాడికి పాల్ప‌డిందో తెలియాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ట్రక్కులో 17 మంది మైనింగ్ కార్మికులు ప్రయాణిస్తున్నారని ఏరియా డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వలీ అగా తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఆస్పత్రికి చెందిన వైద్యుడు తెలిపారు. ఖనిజ సంపద కలిగిన ఓ ప్రాంతం బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా వేర్పాటువాద జాతి బలూచ్ గ్రూపుల తిరుగుబాటు ఉంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు కూడా చురుకుగా ఉన్నారు.

బలూచిస్థాన్‌లో ఇది మొదటి ఘటన కాదు. ఇటీవలి కాలంలో అక్కడ హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. ఈరోజు కూడా బన్నూలో సెక్యూరిటీ కాన్వాయ్ దగ్గర జరిగిన పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మంగళ్ మేళా ప్రాంతానికి సమీపంలోని డోమెల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబులు అమర్చి పేలుడు సంభ‌వించేలా చేశారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాదిని పట్టుకోలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870