हिन्दी | Epaper

Latest Telugu News: Pak-పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం

Vanipushpa
Latest Telugu News: Pak-పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పేరుతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా అయ్యింది. యుద్ధంతో భారీగా నష్టపోయిన పాక్ యుద్ధానికి ముగింపు పలకాలని కాళ్లబేరానికి వచ్చింది. దీంతో రెండుదేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి వచ్చాయి. అయితే భారత్ ప్రధానంగా పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేసన్ ‘సిందూర్’ లో భాగంగా పాకిస్తాన్ లోని బహావల్ పూర్ లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అహజర్(masood azhar) కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీర్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం
పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం

అజార్ కుటుంబాన్ని ఛిద్రం చేసిన మనసైన్యం
మే 7వ తేదీన బహవల్ పూర్ ని జైషే ప్రధాన కార్యాలయం ‘జామియా మసీదు సుభాన్ అల్లాపై భారత బలగాలు జరిపిన దాడిలో మసూద్ అజహర్(masood azhar) కుటుంబం తీవ్రగా నష్టపోయిందని ఆ కమాండర్ పేర్కొన్నాడు. ‘మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని మన బలగాలు ఛిద్రం చేశాయి’ అని కశ్మీర్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలు, ఇతర సమీప బంధువులు మొత్తం 10మంది మరణించినట్లు సమాచారం. వారితోపాటు అజహర్ ప్రధాన అనుచరులైన నలుగురు సహాయకులు కూడా హతమయ్యారు. మసూద్ అజహర్ 2016 పఠాన్ కోట్, 2019 పుల్వామా(pulwama attack) దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదురొంటున్నాడు. తాజా నిఘా సమాచారం ప్రకారం, అజహర్ తన స్థావరమైన బహావల్ పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బల్టిస్థాన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.

సిందూర్ ఆపరేషన్ వికీపీడియా అంటే ఏమిటి?
2025 మే 7న, పాకిస్తాన్ ఆక్రమిత ఆజాద్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ అనే సంకేతనామంతో క్షిపణి మరియు వైమానిక దాడులను ప్రారంభించినట్లు భారతదేశం ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్‌లో ఎంతమంది మరణించారు?
26 మంది మరణించారు. ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో ఉగ్రవాదం చెలరేగింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న దుండగులు ఒక గ్రామంలోకి చొరబడి, ప్రజలను వారి మతం ఏమిటని అడిగి, వారిని చంపారు, ఫలితంగా 26 మంది మరణించారు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/america-nagamallaiahs-murder-what-are-they-saying/international/548343/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాలకు ఇరాన్ భీకర హెచ్చరిక!

గల్ఫ్ దేశాలకు ఇరాన్ భీకర హెచ్చరిక!

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

📢 For Advertisement Booking: 98481 12870