పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ (Pak-Afghan) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్థాన్లో టమాటా ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 700 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం.
Read Also : California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్ డ్రైవర్ అరెస్ట్

పాక్- అఫ్గాన్ మధ్య ఏటా 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని.. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లోని పాక్-అఫ్గాన్ (Pak-Afghan)ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలిపారు. అఫ్గాన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ జనాభా ఎంత?
2024 నాటికి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 35.7 మిలియన్లుగా అంచనా వేయబడింది. 2025 నాటికి ఇది సుమారు 44.5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఆఫ్ఘనిస్తాన్ బహుళ జాతి మరియు బహుళ భాషా సమాజంతో కూడిన దేశం.
భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు పేరు ఏమిటి?
1893లో ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్ మరియు బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యం మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా డ్యూరాండ్ రేఖను ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క బ్రిటిష్ దౌత్యవేత్త మోర్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఎమిర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ స్థాపించారు, వారి వారి ప్రభావ రంగాల పరిమితిని నిర్ణయించడానికి మరియు మెరుగుపరచడానికి..
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: