हिन्दी | Epaper

Shortage hotels : గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

Sai Kiran
Shortage hotels : గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

Shortage hotels : దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత తెలంగాణలోని హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో హోటళ్లు వంటలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా గత రెండు రోజుల్లోనే హోటల్ వ్యాపారులకు సుమారు రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

2-3 రోజులకు సరిపడే గ్యాస్ మాత్రమే

ప్రస్తుతం హోటళ్ల వద్ద ఉన్న సిలిండర్లు మరో రెండు నుంచి మూడు రోజుల వరకే సరిపోతాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. సరఫరా సాధారణ స్థితికి రాకపోతే మరిన్ని హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా హోటల్ రంగంపై ప్రభావం

తెలంగాణలో దాదాపు 50 వేల హోటళ్లు ఉన్నాయి. రోజుకు సుమారు రూ.300 కోట్ల టర్నోవర్ ఈ రంగంలో జరుగుతోంది. ఈ వ్యాపారంపై దాదాపు కోటి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నట్లు అంచనా.

గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే అనేక హోటళ్లలో వంటలు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లుతోంది.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

Shortage hotels
Shortage hotels

గ్యాస్ సంక్షోభానికి కారణం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా ప్రభావితమైంది. ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశంలో LPG ఉత్పత్తిని 10 శాతం వరకు పెంచినట్లు తెలిపింది.

Hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870