हिन्दी | Epaper

TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

Shobha Rani
TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

భారత్, పాకిస్థాన్ (pakistan-India) వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మరో కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియా ట్రూత్​లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్పే ఏమీ లేవని రెండు దేశాల నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఘర్షణ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం
“ఘర్షణతో లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోవచ్చు. మీరు చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సాయం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. మనం కేవలం చర్చించడమే కాదు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందాం. కశ్మీర్‌ విషయంలో పరిష్కారాన్ని కనుక్కోగలిగితే మీతో కలిసి పనిచేస్తాను” అంటూ ట్రూత్‌ లో పోస్ట్ పెట్టారు ట్రంప్.
నిజానికి ట్రంప్ తన తొలి విడత పాలనలో కూడా అప్పుడు కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారు. అప్పటి భారత్, పాకిస్థాన్ ప్రధానుల వద్ద కూడా ప్రస్తావించారు. కానీ అప్పుడు మన దేశం మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరించింది. దీంతో ట్రంప్ ఆ విషయంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మరోసారి ప్రతిపాదించారు.

TRUMP: 'కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా'- ట్రంప్ కొత్త ప్రకటన
TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

ఇప్పుడు మరోసారి ప్రతిపాదన
మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయని ట్రంప్‌ (Donald trump) తొలుత ట్రూత్ పోస్టులో ప్రకటించారు. ఆ తర్వాత భారత్‌ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. “శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్‌ డీజీఎంఓ భారత డీజీఎంవోకు కాల్ చేశారు. ఆ తర్వాత కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది” అని విదేశాంగ శాఖ ప్రకటించింది. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవికాలంలో కూడా కశ్మీర్‌ సమస్యపై మూడో పక్షంగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటి భారత ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించింది. అటుపై ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడలేదు.
కానీ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాక్ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి, వాటిని కూల్చేసింది సైన్యం. శ్రీనగర్‌లో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్‌ డ్రోన్లను కూల్చేసింది. డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారతదేశం, పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ప్రసరించాయి. అయితే, పాక్ వైఖరి మరోసారి ప్రశ్నార్థకమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు శాంతికి దోహదం చేస్తాయా? లేక అంతర్గత వ్యవహారాలలో జోక్యంగా భావించబడతాయా అనేది చూస్తే తేలుతుంద

Read Also: Primister Modi : ప్రధాని మోదీ వార్నింగ్‌తో ప్రశాంతంగా గడిచిన రాత్రి ఇదే..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

📢 For Advertisement Booking: 98481 12870