భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాజాగా చేసిన ప్రకటనలు మరోసారి భారతదేశ విధానాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశాయి. భారత్–పాకిస్థాన్ సంబంధాల పరిష్కారం పూర్తిగా ద్వైపాక్షికత ద్వారా మాత్రమే సాధ్యం అనే దృక్పథం. నెదర్లాండ్స్ లోని ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అమెరికా మధ్యవర్తిత్వం వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అన్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.

భారత్ వైఖరి: చర్చలు అవశ్యం
జైశంకర్ మాట్లాడుతూ, ఇది కేవలం భారత్, పాకిస్థాన్ దేశాలు నేరుగా పరిష్కరించుకోవాల్సిన విషయం అని అన్నారు. ఇందులో మరో దేశ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టే అంశానికి ప్రాధాన్యతనిస్తూ, పాకిస్థాన్తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని ఆయన పునరుద్ఘాటించారు. మేము చర్చలకు ఎప్పుడూ సిద్ధమే, కానీ ఆ చర్చలు సీరియస్గా ఉండాలి, ఉగ్రవాదాన్ని ఆపే విషయంపై దృష్టి సారించాలి అని జైశంకర్ వివరించారు.
అమెరికా పాత్రపై క్లారిటీ అంతర్గత సమస్యలపై మధ్యవర్తిత్వం అసాధ్యం
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, మాట్లాడుతూ ఈ రెండు దక్షిణాసియా దేశాల మధ్య ‘వేల సంవత్సరాల సంఘర్షణ’లో శాంతి నెలకొల్పడానికి అమెరికా సహాయపడిందని పేర్కొన్నారు. అయితే, కశ్మీర్ సమస్యతో పాటు ఇతర ఉద్రిక్తతలు పూర్తిగా ద్వైపాక్షిక అంశాలని, వీటికి బయటి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తూ వస్తోంది.
పాకిస్థాన్ వైఖరి, ఉగ్రవాద మార్గం
1947లో దేశ విభజన నాటి నుంచి భారత్-పాకిస్థాన్ సంబంధాల చారిత్రక సంక్లిష్టతలను కూడా జైశంకర్ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గిరిజన మిలీషియాల ముసుగులో పాకిస్థాన్ సైనికులను కశ్మీర్లోకి పంపడంతోనే ఆ దేశ వైఖరి మొదలైందని, వీరిలో కొందరు యూనిఫాంలో, మరికొందరు సాధారణ దుస్తుల్లో ఉన్నారని తెలిపారు. చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ తీవ్రవాద మార్గాన్ని అనుసరిస్తూ, సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్పై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
Read a;Muhammad Yunus: రాజీనామా యోచనలో యూనస్- ఆర్మీ ఒత్తిడే కారణమా?