ఇరాన్లో (In Iran) రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన వారసుడిని ఎంపిక చేసే దశలో ముగ్గురు సీనియర్ మత పెద్దల పేర్లను మాత్రమే ప్రతిపాదించారు. ఆశ్చర్యకరంగా, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు జాబితాలో లేదు.ఖమేనీ తర్వాత దేశ అత్యున్నత నేతగా ఎవరు ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఖమేనీ ముగ్గురు మత నాయకుల పేర్లను సూచించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గతంలో ఇబ్రహీం రైసీ ఈ స్థానానికి మినహాయింపు లాంటి వాడిగా ప్రచారం పొందారు. కానీ ఆయన మృతితో ఆ ఊహాగానాలు తుడిచిపెట్టబడ్డాయి.
కుమారుడికి అవకాశం లేకపోవడం అనేక సందేహాలకు దారి
తన కుమారుడిని వారసుడిగా ఖమేనీ ఎంపిక చేయకపోవడాన్ని విశ్లేషకులు రాజవంశ పాలనకు చెక్గా చూచుతున్నారు. మతాధిష్టిత పాలనకు పరిమితంగా ఉండాలన్న దృక్పథాన్ని ఖమేనీ దృఢంగా నిలబెట్టుకుంటున్నారని భావిస్తున్నారు. మతపరమైన అస్తిత్వాన్ని కాపాడటం ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంకర్లోకి ఖమేనీ.. భద్రత ఆందోళనగా మారిన పరిస్థితి
ఇజ్రాయెల్, అమెరికా తరఫున వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఖమేనీ బంకర్లోకి వెళ్లినట్లు సమాచారం. అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేసి, నమ్మకమైన సహాయకుడి ద్వారా మాత్రమే సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్లు మరణించడంతో ఆయన భద్రతపై మరింత జాగ్రత్తపడుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.మొజ్తబా పేరు లేని ఈ జాబితా ఖమేనీ పాలన ముగింపు దశలో ఉందన్న సంకేతంగా పలువురు భావిస్తున్నారు. సైనికంగా, మతపరంగా, రాజకీయంగా ఇరాన్ మార్పును ఎదుర్కొంటుందని స్పష్టమవుతోంది. ఖమేనీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపనున్నాయి.
Read Also : Brazil Hot Air Balloon : హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుని 8 మంది దుర్మరణం