Iran Israel War: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లో పెను అనిశ్చితిని సృష్టించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరో రెండు వారాల పాటు ఇలాగే కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధర బ్యారెల్కు 150 డాలర్లకు చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే భారత్ సహా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయి.
Read Also: Gas Booking New Rules: గ్యాస్ బుకింగ్పై కొత్త రూల్: 21 రోజులు ఆగాల్సిందే!
లీటర్ పెట్రోల్ కేవలం రూ.2 నుంచి రూ. 5 మాత్రమే!
అయితే, చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఇరాన్.. తన దేశ ప్రజల కోసం భారీ సబ్సిడీలను భరిస్తుంది. ఆర్థికంగా దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. తన పౌరులకు మాత్రం ఇబ్బంది లేకుండా నామమాత్రపు ధరకే ఇంధనం అందజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతుంటే,

ఇరాన్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 2 నుంచి రూ. 5 మధ్యలోనే ఉంటుందంటే నమశక్యంగా లేదు కదా?. ప్రభుత్వం నష్టాన్ని భరించి మరీ ప్రజలకు ఇంధనాన్ని దాదాపు ఉచితంగా అందిస్తోంది. ఇది ఆ దేశం తన సొంత నిల్వలపై ఎంతలా ఆధారపడుతుందో, ప్రజలకు ఎంత భరోసా ఇస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: