Iran Israel War: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం పెను విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ భీకర పోరు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 200 మంది చిన్నారులు మృతి చెందినట్లు అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ (UNICEF) వెల్లడించింది. యుద్ధంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేని పసిపిల్లలు, అగ్రదేశాల ఆధిపత్య పోరులో బలిపశువులవుతుండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read Also: Pete Hegseth: ‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

దేశాల వారీగా మరణాల వివరాలు: ఇరాన్లోనే అత్యధికం
యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మరణించిన చిన్నారుల్లో అత్యధికులు ఇరాన్ దేశానికి చెందిన వారే ఉన్నారు. గణాంకాలను పరిశీలిస్తే:
- ఇరాన్: 181 మంది చిన్నారులు.
- లెబనాన్: ఏడుగురు.
- ఇజ్రాయెల్: ముగ్గురు.
- కువైట్: ఒకరు. క్షిపణి దాడులు, వైమానిక దాడుల కారణంగా ఈ ప్రాణనష్టం సంభవించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: