అమెరికా మరియు ఇజ్రాయెల్ వైమానిక దాడుల ధాటికి ఇరాన్లోని చమురు నిల్వలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ దాడుల జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నల్లటి రంగులో వర్షం కురవడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చమురు నిల్వలు భారీ ఎత్తున దగ్ధమైనప్పుడు, గాలిలోకి అపారమైన పరిమాణంలో కార్బన్ (మసి), సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఇతర రసాయన కణాలు విడుదలవుతాయి. ఇవి మేఘాలతో కలిసి వర్ష రూపంలో నేలకు చేరుతున్నాయి. దీనినే నిపుణులు “ఆమ్ల వర్షం” (Acid Rain) కంటే ప్రమాదకరమైన “చమురు కలుషిత వర్షం”గా అభివర్ణిస్తున్నారు. ఈ విషపూరిత వర్షం మరియు గాలి కారణంగా ఇరాన్ నివాసితులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Read Also: Iran warning : విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

శ్వాసకోశ ఇబ్బందులు
గాలిలోని విషపూరిత కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. నాడీ సంబంధిత సమస్యలు: రసాయనాల ప్రభావంతో తీవ్రమైన తలనొప్పి, కళ్లు మండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చర్మ వ్యాధులు: ఈ నల్లటి వర్షం నేరుగా శరీరంపై పడితే చర్మంపై దద్దుర్లు మరియు అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెచ్చరికల ప్రకారం, ఈ వర్షం కేవలం మనుషులకే కాకుండా పర్యావరణానికి కూడా గండంగా మారింది: భవనాలు మరియు వాహనాలు: కార్లు, భవనాలపై నల్లటి చమురు పొరలు పేరుకుపోతున్నాయి. ఆమ్ల వర్షం వల్ల భూమి సారం దెబ్బతిని, పంటలు నాశనమయ్యే అవకాశం ఉంది. నదులు, చెరువుల్లో ఈ కలుషిత నీరు చేరడం వల్ల జలచరాలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: