हिन्दी | Epaper

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

Vanipushpa
Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున ఖర్చు తగ్గింపు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వేగంగా అమలు చేయడం. కానీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం ప్రత్యేకంగా కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రొఫెషనల్ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది.

టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్
ఇండియాలో ప్రముఖ ఐటీ కంపెనీగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ 40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్ నియమించుకోనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్ నెట్, ఆండ్రాయిడ్ iOS డెవలప్‌మెంట్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వంటి రంగాలలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికీ మంచి ప్యాకేజితో ఉద్యోగ అవకాశాలు అందించనున్నట్లు వెల్లడించింది.
ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
అదేవిధంగా గత సంవత్సరం ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొంతమంది ప్రొఫెషనల్స్’ని సెలక్ట్ చేసింది. ఆ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి బెంగళూరు, చెన్నై ఇంకా హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ ఆఫీసులకు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారా అందించినట్లు నివేదించింది. ఇంటర్వ్యూకి ఎక్కడికి రావాలో సలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇన్ఫోసిస్ వారికే ఇచ్చింది. మూడు సంవత్సరాల క్రితం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇన్ఫోసిస్ బెంగళూరు ఆఫీస్ నుండి వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొఫెషనల్స్’ని రిక్రూట్ చేసుకుంది.
20 వేల మంది ఫ్రెషర్ల నియామకం
అంతేకాదు ఈ ఏడాది అంటే 2025లో 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనితో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కూడా నియమించుకోవడానికి ఇలాంటి ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 3.23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల ప్లేస్మెంట్లను భర్తీ చేయడానికి అలాగే కొత్త ప్రాజెక్టులకు ఫ్రెషర్లను సెలెక్ట్ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇది కాకుండా ఇన్ఫోసిస్ గత నెలలోనే 600 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్ లెటర్లను జారీ చేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని ఇన్ఫోసిస్ 600 మంది యువతకు ఉపాధి కల్పించింది.
గత 9 నెలల్లో ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వబోమని కూడా సమాచారం. గత నెలలో ఇన్ఫోసిస్ 300 మందికి పైగా ఎంట్రీ లెవల్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడంతో వివాదంలో చిక్కుకుంది. ఇందుకు ఫ్రెషర్లను నియమించుకుని వారికి శిక్షణ ఇచ్చి కొన్ని ఎలిజాబిలిటీ టెస్టులను కూడా నిర్వహించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

📢 For Advertisement Booking: 98481 12870