हिन्दी | Epaper

India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం..తామేమీ చేయలేమన్న జేడీ వాన్స్

Shobha Rani
India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం..తామేమీ చేయలేమన్న జేడీ వాన్స్

పాకిస్తాన్‌పై దండెత్తింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంపై జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైనప్పుడు తామేమీ చేయలేమని తేల్చి చెప్పింది. వార్ మొదలు కావడానికి ముందే భారత్- పాకిస్తాన్ (india,pak war) మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి చేయాల్సిందంతగా చేశామని పేర్కొంది. ఇందులో పాల్గొనడానికీ అయిష్టత చూపింది. యుద్ధం మొదలైన తరవాత అమెరికా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది తమ సమస్య కాదని, ఇందులో తామేమీ చేయలేమని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ (india,pak war) మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు యుద్ధం ప్రారంభానికి ముందు తాము కావలసినంత చేశామని తెలిపింది.

జేడీ వాన్స్ స్పష్టీకరణ
యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అది యుద్దనీతి అనిపించుకోదనీ తేల్చి చెప్పారు. ఇందులో తాము పాల్గొనదలచుకోలేదనీ అన్నారు. యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సలహా మాత్రమే ఇవ్వగలమని అన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైన తరువాత ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ తమకు సంబంధించినది కాదని (None of our business) కాదని, దాన్ని నియంత్రించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం: తాజా పరిణామాలు
India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం: తాజా పరిణామాలు

అస్త్రసన్యాసం చేయమని తామెలా భారత్‌కు గానీ, పాకిస్తాన్‌కు గానీ చెప్పగలమని అన్నారు. అలా ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. దౌత్య మార్గాల ద్వారానే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తామని జేడీ వాన్స్ (Jd vance) స్పష్టం చేశారు. ఈ యుద్ధం- ఈ రెండు దేశాలకే పరిమితం కావాలని, మరింత విస్తరించకూడదని అమెరికా కోరుకుంటోందని అన్నారు. బారత ఉపఖండం లేదా ఆసియా- పసిఫిక్ రీజియన్, అణ్వస్త్ర యుద్ధంగా మారబోదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అణు యుద్ధ భయం
దీనిపైనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని, అలా జరగకూడదని జేడీ వాన్స్ అన్నారు. ఆ స్థాయి తీవ్రత ఉండదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన వివరించారు. భారత్- పాకిస్తాన్‌ల (india,pak war) వద్ద ఉన్న కూలర్ హెడ్‌ల పని.. ఇది- అణు యుద్ధంగా మారకుండా చూసుకోవడం అని వ్యాఖ్యానించారు. అది జరిగితే, అది వినాశనానికి దారి తీస్తుందని చెప్పారు.

Read Also: Pakistan: భారత్ దెబ్బ : ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లతో పౌరులు భయబ్రాంతులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

📢 For Advertisement Booking: 98481 12870