AI collaboration india israel : Narendra Modi ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్–Israel మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కృత్రిమ మేధ (AI), వ్యవసాయం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా క్షిపణులు, డ్రోన్ల సాంకేతికత బదిలీపై అవగాహన కుదిరింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో సంయుక్త పరిశోధనలకు ఒప్పందం కుదిరింది.
Read Also: CM Chandrababu : రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ భారత Unified Payments Interface (UPI) సేవలను ఇజ్రాయెల్లో వినియోగించేందుకు అంగీకారం తెలిపారు. సైబర్ భద్రత బలోపేతం కోసం సమాచార మార్పిడి, సైబర్ దాడులను ఎదుర్కొనే చర్యలపై ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
వ్యవసాయ రంగంలో సహకారం పెంపొందించేందుకు 100 ఎక్సలెన్స్ సెంటర్ల స్థాపనపై ఒప్పందం జరిగింది. రైతులకు ఆధునిక సాంకేతికత అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి.
ఇజ్రాయెల్ పార్లమెంట్ Knessetలో ప్రసంగించిన మోదీ, ఇరు దేశాల స్నేహం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ముగింపు సందర్భంగా Benjamin Netanyahu మాట్లాడుతూ, ఇది కేవలం ఒప్పందాల పరిమితి కాదని, రెండు దేశాల మధ్య ఉన్న మేధస్సు, హృదయాల అనుబంధానికి ప్రతీక అని అన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: