Iran Israel war : ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల నుంచి 50 విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. గత రెండు రోజుల్లో 100 సర్వీసుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు వెల్లడించింది.
పలు దేశాల నుంచి విమానాలు
దుబాయ్, అబుదాబీ, రస్ అల్ ఖైమా, పుజరాహ్, మస్కట్, జెడ్డాల నుంచి విమానాలు సురక్షితంగా నడిచినట్లు పౌర విమానయాన శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆయా విమానాశ్రయాల్లో పరిస్థితులు, సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: TVK Party : విజయ్ సరికొత్త పాలిటిక్స్

టిక్కెట్ ధరలపై నిఘా
టిక్కెట్ ధరలు సహేతుకంగా ఉండేలా విమాన ఛార్జీలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం పేర్కొంది.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :