हिन्दी | Epaper

వ్యవసాయ రంగంలోనూ AI ప్రభావం: సత్య నాదెళ్ల

Vanipushpa
వ్యవసాయ రంగంలోనూ AI ప్రభావం: సత్య నాదెళ్ల

వ్యవసాయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో ఒక చిన్న పొలం దిగుబడిని పెంచడానికి AI వాడకాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన అధికారిక X హ్యాండిల్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు.


పంట దిగుబడిని పెంచుతుంది
ఇక్కడి చెరకు రైతుల కథను నాదెళ్ల వివరించారు. వారు కరువు, అప్పులు, పంటలను ప్రభావితం చేసే వివిధ వ్యాధులు, ఆత్మహత్యలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు AI వారి అదృష్టాన్ని మార్చేసింది. రసాయనాలను తక్కువగా ఉపయోగించడం ద్వారా పంట దిగుబడిని పెంచడానికి, నీటి వినియోగాన్ని మెరుగుపరచడానికి AI రైతుకు ఎలా సహాయపడుతుందో ఈ వీడియో వివరిస్తుంది. AI రైతుల అదృష్టాన్ని మార్చిందని ఆయన అన్నారు. ఆయన షేర్ చేసిన వీడియోలో, చిన్న రైతులు AI శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా పంటల దిగుబడిని ఎలా పెంచుతున్నారో చూడవచ్చు. వ్యవసాయంపై AI ప్రభావాన్ని సత్య నాదెళ్ల అద్భుతంగా అభివర్ణించారు.

వ్యవసాయ రంగంలోనూ AI ప్రభావం: సత్య నాదెళ్ల

రైతుల పంట ఉత్పత్తి పెంచుకోవడం

మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా వారు తమ పంటల దిగుబడిని పెంచుకున్నారని తెలిపారు. డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి పొందిన జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి, రైతులకు తమ భూమి పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ సాంకేతికత రైతుల భాషలో ఉండటం ద్వారా వారి పనులను మరింత సులభతరం చేస్తుందని ఆయన అన్నారు.


తక్కువ నీటితో పంటలు
ఈ క్రమంలో ఏఐ వినియోగం వల్ల పంటలకు రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దీంతోపాటు రైతులు వారి పొలాల గురించి తెలుసుకుని, తక్కువ నీటితో పంటలను పండించుకోవచ్చన్నారు. ఇలా చేయడం ద్వారా వారి పొలాల్లో నీటి ఉత్పత్తిని మెరుగుపరుచుకుని, అధిక దిగుబడిని సాధించవచ్చన్నారు. వ్యవసాయానికి ఏఐ ఎంతో భవిష్యత్తునిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870