हिन्दी | Epaper

Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌

Vanipushpa
Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌

అధిక సంతానం మంచిది కాదనే వాదనను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ (Tesla ceo elon musk) ఎప్పుడూ కూడా తప్పుబడుతుంటారు. తాజాగా ఆయన మరోసారి అదే వైఖరిని అనుసరించారు. ప్రస్తుతం అమెరికా(America)లో జననాల సంఖ్య తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వివిధ సమస్యల వల్ల ప్రపంచంలో జననాల(World Population) రేటు తగ్గుతోందని అన్నారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌(X)లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో జనాభా తగ్గుతుండటంతో సగటున ముగ్గురిని చెప్పిన ఫార్చ్యూన్(fortune report) రిపోర్టును ఉటంకిస్తూ మస్క్ పోస్టు చేశారు. “నా మాటలు నమ్మకపోతే, ఇంకో 20 ఏళ్లు వేచి చూడండి. నాగరికత ముప్పులో పడుతుంది.”
అని స్పష్టం చేశారు.

Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌
Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌

జనాభా రేటు పడిపోతున్నది: నిపుణులు
ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే సంపన్న దేశాలైన అమెరికా, ఇటలీ, జపాన్ వంటి దేశాల్లో జననాల రేటు ఏటా తగ్గుతోందని
దీనివల్ల జనాభా రేటు పడిపోతుందని నిపుణులు తెలిపారు. దీన్ని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురిని కనాలని సూచించారు. ఈ క్రమంలోనే అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గడం వల్ల నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్‌ అన్నారు. తన మాటలు నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని తెలిపారు. భారత మహిళలు సగటున 5 మంది పిల్లలు కనేవారు
తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొంది. వివిధ ఆరోగ్య సమస్యల వల్ల వందల మిలియన్ల మంది ప్రజలు తాము కొరుకున్నంతమంది పిల్లలను కనలేకపోతున్నట్లు తెలిపింది. సరైన భాగస్వామి దొరకకపోవడం, పిల్లలను పెంచేందుకు అధిక ఖర్చులు లాంటి విషయాలు దీనికి కారణమవుతున్నాయని వెల్లడించింది. ఇక సంతానోత్పత్తి రేటు తగ్గించడంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని UNFPA భారత ప్రతినిధి ఆండ్రియా తెలిపారు. 1970లలో భారత్‌లోని మహిళలు 5 మందిని కనేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య పడిపోయిందని చెప్పారు. ఎలాన్ మస్క్ చేసిన సూచన అంతర్జాతీయంగా పాజిటివ్‌, నెగటివ్‌ అభిప్రాయాలను రేపుతోంది. కానీ మస్క్ స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే, భవిష్యత్ నాగరికతను నిలబెట్టుకోవాలంటే జననాల స్థిరీకరణ అవసరం అని.

Read Also: Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గూఢచారి సమాచారం చైనా నుంచి వచ్చింది: పాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870