हिन्दी | Epaper

Earthquake : మయన్మార్‌లో భూకంపం..2700కు పెరిగిన మృతులు

sumalatha chinthakayala
Earthquake : మయన్మార్‌లో భూకంపం..2700కు పెరిగిన మృతులు

Earthquake : మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో ఇటీవల 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల ధాటికి అనేక భవంతులు ఊగిపోగా.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ భూవిలయం లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం వచ్చిన ఆ భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారని తాజాగా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా.. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

image

వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం

ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రీస్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారని ఐరాస సిబ్బంది వెల్లడించారు.

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు పిలుపునిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870