టారిఫ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరో బాంబు పేల్చారు. 14 దేశాలపై కొత్త వాణిజ్య పన్నులు (US Tarrifs) విధించనున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా మయన్మార్, లావోస్పై 40 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

అప్పటిలోపు కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదరకపోతే పెరిగిన దిగుమతి సుంకాలను అమలు చేస్తామని హెచ్చరిస్తూ ఆయా దేశాలకు లేఖలు పంపినట్లు ట్రంప్ (Donald Trump) తెలిపారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించే దేశాలను ఉపేక్షించేది లేదన్నారు. జులై 9 డెడ్లైన్ ముగుస్తున్నందున, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోని దేశాలపై భారీ సుంకాల విధింపునకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ (Donald Trump) సంతకం చేస్తారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలైన్ లీవిట్ వెల్లడించారు.
మయన్మార్-40 శాతం, లావోస్ – 40 శాతం, థాయ్లాండ్ – 36 శాతం, కాంబోడియా-36 శాతం, బంగ్లాదేశ్-35 శాతం, సెర్బియా-35 శాతం, ఇండొనేషియా-32 శాతం, సౌత్ ఆఫ్రికా – 30 శాతం, బోస్నియా అండ్ హెర్జ్గొవీనా – 30 శాతం, మలేషియా – 25 శాతం, ట్యునీషియా – 25 శాతం, జపాన్ – 25 శాతం,
కజకిస్థాన్- 25 శాతం, సౌత్ కొరియా -25 శాతం.
వాణిజ్య పన్నులు వేయడానికి కారణాలు ఏమిటి?
అమెరికా ఉత్పత్తులు కొనేందుకు నిరాకరించే దేశాలపై పెనాల్టీ విధిస్తున్నారు.
అంతర్జాతీయ స్పందన ఎలా ఉంది?
అంటార్జాతీయ దిగుమతిదారులు ఈ నిర్ణయాన్ని “టారిఫ్ బ్లాక్ మైల్” గా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
Read hindi : hindi.vaartha.com
Read Also:Trump: ప్రతీకార సుంకాల విధింపు మరోసారి వాయిదా వేసిన ట్రంప్