పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబా ఖమేనీ(Ayatollah Mojtaba Khamenei) ప్రాణాలతో ఉన్నారా? లేదా? అన్న సందేహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొజ్తాబా ఖమేనీ “ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని” తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: US vs Iran: అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

Trump: Donald Trump’s clarity on Mojtaba’s health
మోజ్తాబాకి చాలా నష్టం జరిగింది: డొనాల్డ్ ట్రంప్
ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్లోని కాంపౌండ్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో మోజ్తాబా తండ్రి, అప్పటి సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. ఫాక్స్ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “అతడు బహుశా బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కానీ అతడికి చాలా నష్టం జరిగింది” అని వ్యాఖ్యానించారు. ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ కూడా మొజ్తాబా గాయపడినట్లు ధ్రువీకరించారు. ఆయన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, అందుకే రహస్య ప్రదేశంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొజ్తాబా భార్య, సోదరి, మేనకోడలు కూడా గత నెలలో జరిగిన దాడుల్లో మరణించారని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: