తైవాన్కు ఆయుధాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా(China) మండిపడింది. తైవా
న్కు ఆయుధాలను విక్రయిస్తే భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, తైవాన్కు గత కొన్నేళ్లుగా ఆయుధాల సరఫరాలో పాల్గొన్న 20 రక్షణ కంపెనీలు, 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై చైనా విదేశాంగ శాఖ ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ వార్త సంస్థ నివేదించింది. అమెరికా తైవాన్కు ఆయుధాలు సరఫరా చేయడం అంటే ‘వన్-చైనా సిద్ధాంతం’తో పాటు చైనా-అమెరికా సంయుక్త ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అని బీజింగ్ ఆరోపించింది. ఈ చర్యలు చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనని, దేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది.
Read Also: Bangladesh unrest : బంగ్లాదేశ్లో ఉద్రిక్తత, గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు, రాళ్ల దాడి

చైనా ఆంక్షలు విధించిన కంపెనీల జాబితాలో
నార్త్రోప్ గ్రుమ్మన్, బోయింగ్ (సెయింట్ లూయిస్), ఎల్3 హారిస్ మ్యారిటైమ్ సర్వీసెస్, గిబ్స్ అండ్ కాక్స్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టీల్ డ్రోన్స్ వంటి 20 దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనాలో ఈ కంపెనీలకు ఉన్న స్థిర, చరాస్తులన్నింటినీ స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, చైనా వ్యక్తులు లేదా సంస్థలు ఈ కంపెనీలతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోకూడదని నిషేధించింది. తైవాన్కు ఆయుధాల సరఫరాలో కీలకంగా వ్యవహరించిన ఆండూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీతో సహా 10 మంది ఎగ్జిక్యూటివ్ల విషయంలో కూడా బీజింగ్ కీలక కామెంట్లు చేసింది. వీరు చైనాలోకి ప్రవేశించడంపై పరిమితులు విధించడమే కాకుండా, చైనాలో ఉన్న వీరి ఆస్తులపై ఆంక్షలు విధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: