Telugu News: China Train Accident:టెస్టింగ్ రైలు ఢీకొని 11 మంది కార్మికులు మృతి

Read Time:  1 min
China Train Accident
China Train Accident
FONT SIZE
GET APP

చైనాలోని(China Train Accident) యునాన్ ప్రావిన్స్లో ఒక షాకింగ్ రైలు ప్రమాదం జరిగింది. కున్మింగ్ సమీపంలోని లుయోయాంగ్ టౌన్ రైల్వే స్టేషన్‌లో, పట్టాలపై పనిచేస్తున్న కార్మికులపై టెస్టింగ్ రైలు వేగంగా దూసుకెళ్లడంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Hongkong: ఇంకా ఆరని మంటలు.. 94 కు చేరిన మృతులు!

 China Train Accident
China Train Accident: 11 workers killed after being hit by testing train

భూకంప పరికరాల పరీక్ష, ప్రమాదానికి కారణం

ఈ ప్రమాదానికి కారణమైన రైలు,(China Train Accident) భూకంపాలను గుర్తించే పరికరాలను పరీక్షిస్తున్న టెస్టింగ్ రైలుగా అధికారులు గుర్తించారు. ఆ రైలు వంపు వద్దకు వస్తుండగా, పట్టాలపై పని చేస్తున్న కార్మికులు దానిని ముందుగా గుర్తించలేకపోయారు. దీంతో రైలు వారిని ఢీకొట్టి ఈ ఘోర ప్రమాదం జరిగింది. టెస్టింగ్ రైలు వేగం, కార్మికులు గుర్తించలేకపోవడం ఈ విషాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో యునాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. సంఘటనపై రైల్వే అథారిటీ తక్షణమే విచారణ ప్రారంభించింది. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరు కార్మికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.