భారత పొరుగుదేశం చైనా నిశ్శబ్దంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు పెద్ద ప్రణాళికనే రచించింది. దీనికి సంబంధించి రహస్యంగా ఆర్థిక చర్యను చేపట్టింది. బంగారం కొనుగోలు ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనావస్థలోకి తీసుకువెళ్లేందుకు చైనా రెడీ అయింది. చైనా కేంద్ర బ్యాంకు నిరంతరం Gold కొనుగోలు చేసుకుంటూ పోతోంది. అదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణాన్ని వేగంగా తగ్గించుకుంటూ వస్తోంది చైనా (China). ఈ వ్యూహం ప్రపంచ Gold మార్కట్లో పసిడి పెరుగుదలకు దారి తీసింది. అంతే కాకుండా డాలర్ ఆధారిత వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. చైనా వ్యూహం బయటకు కనిపించేది సాధారణ పెట్టుబడి నిర్ణయంలా అనిపించినా.. లోతుగా చూస్తే ఇది అమెరికా ఆధిపత్యంలో ఉన్న డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నేరుగా సవాలు విసురుతున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు చైనా తన బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ పోతుండగా.. మరోవైపు అమెరికా ప్రభుత్వ రుణాలపై ఆధారాన్ని క్రమంగా తగ్గిస్తోంది.
Read Also: Municipal Election Results: కరీంనగర్లో అధిక్యం దిశగా బీజేపీ

చైనాలో బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.
జనవరి చివరి నాటికి దేశ బంగారు నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు చేరాయి. కేవలం ఒక నెల క్రితం ఇవి 74.15 మిలియన్ ఔన్సులుగా ఉండటం గమనార్హం. అంటే వరుసగా మరో నెల కూడా చైనా బంగారం కొనుగోళ్లు కొనసాగించింది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదని, దీర్ఘకాలిక వ్యూహానికి ఇది స్పష్టమైన సంకేతమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. . ధరలు పెరుగుదలపై కొంపలు ముంచబోతున్న డ్రాగన్ కంట్రీ.. బంగారం పరిమాణమే కాకుండా.. దాని విలువ కూడా వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 2025లో సుమారు 319.45 బిలియన్ డాలర్లుగా ఉన్న చైనా బంగారు నిల్వల విలువ. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం తగ్గుదల. మార్కెట్లలో అకస్మాత్తు కుదుపులు రాకుండా ఉండేందుకు అమెరికా బాండ్ల హోల్డింగ్స్ను తగ్గించాలని చైనా నియంత్రణ సంస్థలు బ్యాంకులకు సూచించాయన్న నివేదికలు కూడా వెలుగులోకి వచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: