हिन्दी | Epaper

నిజ్జర్ హత్య కేసు..మాటమార్చిన కెనడా ప్రధాని ట్రూడో

sumalatha chinthakayala
నిజ్జర్ హత్య కేసు..మాటమార్చిన కెనడా ప్రధాని ట్రూడో

న్యూఢిల్లీ : గతేడాది జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ ఇన్నాళ్లు ఆరోపణలు గుప్పించిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మాట మార్చారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే గట్టి ఆధారాలు ఏవీ లేవని ఆయన అంగీకరించారు. భారత ప్రమేయంపై నిర్ణయాత్మక సాక్ష్యాలు పెద్దగా లేవన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే తాను ఈ ఆరోపణలు చేశానని ఆయన ఒప్పుకున్నారు. కెనడా ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యంపై బహిరంగ విచారణలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కెనడా ఇంటెలిజెన్స్‌తో పాటు ‘ఫైవ్ ఐస్’ మిత్రదేశాల ఇంటెలిజెన్స్ కూడా నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని చాలా స్పష్టంగా, నమ్మదగిన విధంగా చెప్పాయి. కెనడా గడ్డపై కెనడియన్ పౌరుడి హత్యలో భారత ప్రమేయం ఉందని చెబుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఉమ్మడిగా ‘ఫైవ్ ఐస్ నెట్‌వర్క్’ నిఘా ఏర్పాటు చేసుకున్నాయి. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్‌పై ఇది దృష్టి పెడుతుంది. ఫైవ్ ఐస్ అందించిన సమాచారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సినంత ఆందోళనకరంగా ఉందని ట్రూడో చెబుతున్నారు.

ఇదిలావుంచితే 2023లో జరిగిన నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఏజెంట్లే నిజ్జర్‌ను హత్య చేశారని కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. నిజ్జర్ హత్య కేసు విచారణ జరుగుతున్న వేళ జస్టిన్ ట్రూడో చేసిన ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870